Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇచ్చాపురం నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ ...అక్టోబర్ 31 నుంచి చంద్రబాబు శ్రీకారం
posted on: Oct 29, 2024 11:31AM
ఎపిలో కూటమి ప్రభుత్వం ఒక్కో ఎన్నికల హామీని నెరవేరుస్తుంది. గత ఎన్నికలముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీల్లో ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చాయి. కూటమి పార్టీలు అధికారంలో రావడంతో మరో ఎన్నికల హమీ బుధవారం నుంచి అమలు కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభించనున్నారు. దీపావళి వేళ తొలి సిలిండర్ ఇవ్వనున్నారు. ప్రతీ ఇంటిలో దీపాలు వెలిగించాలని, వెలుగులు నింపాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నెల 29 వ తేదీ ఉదయం 10 గంటల నుంచే సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. కోటి 55 లక్షల లబ్దిదారులకు ఉచితంగా సిలిండర్ లు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖామంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు, ఎల్పీజీ కనెక్షన్ కంపల్సరీ. ఈ పథకాన్ని అమలు చేయడానికి మూడు ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. బుక్ చేసిన 48 గంటల లోపు లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుంది. ప్రతీ నాలుగునెలలకు ఒక ఉచిత సిలిండర్ ఇవ్వనున్నారు. తొలుత డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే లబ్దిదారుల ఖాతాల్లో జమఅవుతాయి. సిలిండర్ కు 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడనుంది. మొత్తం మూడుసిలిండర్లకు 2 వేల 684 కోట్ల భారం ప్రభుత్వం మోయనుంది.


.webp)



