Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో నాలుగు గ్రీన్ ఫీల్డ్ హైవేలు.. ట్రాఫిక్ సమస్యలు ఇక మటుమాయం!
posted on: Oct 25, 2024 9:14AM

ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, అలాగే ప్రధాన నగరాలతో కనెక్టివిటీ పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు గ్రీన్ ఫీల్డ్ హైవేలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దాదాాపు 45 వేల 300 కోట్ల వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ లక్ష్యంగా వీటి నిర్మాణం ఉంటుందన్నారు. ముందుగా హైదరాబాద్ మచిలీపట్నంను కనెక్ట్ చేసేలా 18 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తామన్నారు.
జగన్ అరాచకపాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ అధ్వానంగా మారాయన్నారు. రోడ్డు, రవాణా వ్యవస్థ కూడా నాశనమైందన్నారు. ఇక జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. 70 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 21 ప్రాజెక్టులకు అటవీ భూముల సమస్యలు, 3 ప్రాజెక్టులకు టోల్ప్లాజా సమస్యలు ఉన్నాయని వివరించారు. మరో ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయని చెప్పిన ఆయన వీటన్నిటినీ మూడు నెలల వ్యవధిలో సరిచేస్తామని చెప్పారు.
అదే విధంగా లాజిస్టిక్ హబ్ గా ఏపీ మారనుందన్న ఆయన ఏపీకి మరో మూడు పోర్టులు రానున్నాయన్నారు. అక్వా, హార్టీ కల్చర్ ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత మెరుగ్గా, ఎఫెక్టివ్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారు. అధికారులు ఆ దిశగా మరింత వేగంగా చురుకుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. జగన్ హయాంలో విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తున్నామన్నారు.


.webp)



