Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీజేపీకి రాపోలు గుడ్ బై.. తెరాసలో చేరిక
posted on: Oct 23, 2022 11:22PM
తెలంగాణలో అధికారం మాదే అని తొడగొట్టి చెబుతున్న బీజేపీకి.. ఆ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక ముందు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మునుగోడు విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై క్యాడర్ లో మరింత ధీమా పెంచాలన్న ఉద్దేశంతో బీజేపీ కోరి ఆహ్వానించిన ఈ ఉప ఎన్నిక ముంగిట ఆ పార్టీ నుంచి వలసలు చినుకుల్లా ప్రారంభమై తుపానుగా మారాయి.
రెండు రోజుల కిందట మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కారెక్కిన సంగతి విదితమే. ఆ వెంటనే రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి గుడ్ బై చెప్పి తెరాస గూటికి చేరారు.
దీంతో బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక ముంగిట వలసలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ వలసలు రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని తెరాస శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పి గులాబి కండువా కప్పుకున్న రాపోలు ఆనంద భాస్కర్, చేరికకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత కేటీఆర్ సమక్షంలో తెరాస గూటికి చేరి.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చేనేతపై జీఎస్టీ వేయడం దారుణమని రాపోలు ఆనంద భాస్కర్ విమర్శించారు. చేనేత అభివృద్ధికి మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్యలను ప్రస్తుతించారు.


.webp)



