నేడు డీ.యస్. తెరాసలో చేరిక

posted on: Jul 8, 2015 7:23AM

 

మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈరోజు మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి తెరాసలో చేరబోతున్నారు. ఆయన జిల్లా (నిజామాబాద్) కి చెందిన పలువురు జడ్పీటీసీ, యంపీటీసిలు, కార్పొరేటర్లు తడిఅతరులు ఆయనతో కలిసి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణా భవన్ లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు. పార్టీ అధిష్టానం తనకు రెండసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే బాధతో కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని త్రెంచుకొని డి.శ్రీనివాస్ తెరాసలోకి వెళుతున్నారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినందునే ఆయన తెరాసలో చేరేందుకు సిద్దపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తను ఎటువంటి పదవులు ఆశించి తెరాసలో చేరడం లేదని ఆయన చెపుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...