Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎసిబి కోర్టు చేతిలో ఫోరెన్సిక్ తుది నివేదిక
posted on: Jul 3, 2015 8:43AM
.jpg)
ఓటుకి నోటు కేసులో ఎసిబి అధికారులు ఫోరెన్సిక్ సంస్థకు అందించిన ఆడియో వీడియో టేపులపై తుది నివేదికను ఆ సంస్థ అధికారులు నిన్న సాయంత్రం ఎసిబి కోర్టుకి సమర్పించారు. కనుక ఆ నివేదికను కోరుతూ ఎసిబి అధికారులు ఈరోజు కోర్టులో ఒక మెమో దాఖలు చేయనున్నారు. అది చేతికి అందిన తరువాత ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. కానీ తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తను ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు సిద్దమని ఎసిబి అధికారుఅలకు లేఖ వ్రాసినా వారు ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే, వారు తదుపరి చర్యలు చేప్పట్టడానికి తొందరపడక పోవచ్చునని స్పష్టమవుతోంది. ఏమయినప్పటికీ ఇప్పుడు ఈ కేసు చాలా కీలక దశకు చేరుకోన్నట్లే భావించవచ్చును.






