స్నేక్‌గ్యాంగ్ మీద ఐదు కేసులు నమోదు

 

హైదరాబాద్‌లో ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకున్న స్నేక్‌గ్యాంగ్ ఇప్పుడు పోలీసుల చెరలో వుంది. పాములు చూపించి బెదిరించి ఈ స్నేక్‌గ్యాంగ్ ఇప్పటి వరకు 11 మంది అమ్మాయిల మీద సామూహిక అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఈ స్నేక్గ్యాంగ్పై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ ముఠా సభ్యులను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు చెందిన దయానీతో పాటు మరో నిందితుడిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సామూహిక అత్యాచారం, వ్యక్తిని తీవ్రంగా కొట్టడం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, బెదిరింపుల కేసు, భూ కబ్జా కేసులు ఈ గ్యాంగు మీద నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులకు సెప్టెంబర్ నాలుగవ తేదీ వరకు రిమాండ్‌ విధించారు