Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోర్టులో 30రౌండ్ల కాల్పులు.. ముగ్గురు మృతి
posted on: Jun 3, 2015 11:42AM

ఒక పక్క కోర్టులో విచారణ జరుగుతోంది.. ఇంతలో ఇద్దరు దుండగులు అమాంతంగా కోర్టు హోలులోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం అనేక అక్రమాలకు పాల్పడిన కేసులో సుశీల్ శ్రీవాస్తవ్ అనే కరుడుగట్టిన ఓ ముఠా నాయకుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఐదేళ్లుగా విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా శ్రీవాస్తవ కోర్టులో హాజరుకాగా ఇద్దరు దుండగులు కోర్టు హాలులోకి ప్రవేశించి వారి దగ్గరున్న ఏకే 47 తుపాకులతో కాల్పులు జరపగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రౌండ్ల తూటాలు బయటకొచ్చాయి. ఈ కాల్పుల్లో శ్రీవాస్తవ్ తోపాటు అతని సన్నిహితులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.






