Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అగ్రరాజ్యంలో రాజ్యమేలుతున్న అరాచకం.. ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు.. 21 మంది మృతి
posted on: May 25, 2022 8:27AM
పేరుకే అగ్రరాజ్యం.. అక్కడ రాజ్యమేలేది అరాచకం. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటం అక్కడ సాధారణం. తాజాగా టెక్సాస్ లోని ఒక ఎలిమెంటరీ స్కూల్ లో 18 ఏళ్ల యువకులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 21 మంది మరణించారు. మంగళవారం జరిగిన ఈ సంఘటనతో అమెరికాయే కాదు మొత్తం ప్రపంచం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఒక వాహనంలో వచ్చిన టీనేజర్ స్కూలు పిల్లలే లక్ష్యంగా కాల్పులు జరిపాడు.
రు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసు కాల్పుల్లో అతడు కూడా మరణించాడు. మరణించిన చిన్నారులంతా 7 నుంచి పదేళ్ల లోపు వారే. మరో పాతిక మంది చిన్నారులూ, ఆరుగురు టీచర్లూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్త మౌతున్నది. వరుసగా కాల్పుల సంఘటనలు జరుగుతున్నా పాఠశాలలు, విద్యా సంస్థల్లో కొత్త వారిని అనుమతించే విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంపై అమెరికా వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి.
పేరుకే అగ్రరాజ్యం కానీ ప్రజల ప్రాణాలకు భద్రత లేని నరకం అన్న విమర్శలు వివిధ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలో అమెరికాలో ఇలా కాల్పుల సంఘటన జరగడం ఇది మూడో సారి కావడాన్ని ఈ సందర్భంగా ఆ సంఘాలు గుర్తు చేస్తున్నాయి.
దేశంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నాలుగేళ్ల కిందట కూడా అమెరికాలో ఇటువంటి సంఘటనే జరిగింది. ఫ్లోరిడాలోని ఒక స్కూలులో జరిగిన కాల్పుల సంఘటనలో 15 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్చు మరణించారు. అగ్రరాజ్యంలో అరాచకత్వం, హింసా ప్రవృతి పెరిగిపోతున్నదన్న ఆందోళన మానవ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు బైడన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతులకు సంతాప సూచకంగా నాలుగు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.


.webp)
.webp)


