ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీ అసెంబ్లీలో అగ్ని ప్రమాదం జరిగింది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లోని ఏసీ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలిపోయినట్టు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందే ప్రమాదం జరగడం, ప్రమాదం సంభవించే సమయానికి ఆరోగ్యమంత్రి కూడా అక్కడ లేకపోవడం వంటివి పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.