Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం
posted on: May 26, 2015 3:16PM

ఢిల్లీ అసెంబ్లీలో అగ్ని ప్రమాదం జరిగింది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లోని ఏసీ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలిపోయినట్టు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందే ప్రమాదం జరగడం, ప్రమాదం సంభవించే సమయానికి ఆరోగ్యమంత్రి కూడా అక్కడ లేకపోవడం వంటివి పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.


.jpg)



