Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొత్త పైత్యం.. ఫైర్ ఛాలెంజ్...
posted on: May 18, 2015 3:53PM

ఆ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన ‘ఐస్ బక్కెట్ ఛాలెంజ్’ గురించి అందరికీ తెలిసిందే. నెత్తిన ఐస్ ముక్కలను కుమ్మరించుకునే ఈ ఛాలెంజ్కి సోషల్ మీడియా పుణ్యమా అని విస్తృత ప్రచారం లభించింది. ఈ ఛాలెంజ్కి నకలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఛాలెంజ్లు బయల్దేరాయి. నెత్తిన ఐస్ ముక్కల బక్కెట్ని కుమ్మరించుకుని మరికొంతమందికి అలా చేయాలంటూ ఛాలెంజ్ విసిరే ఈ ‘ఐస్ బక్కెట్’ ఛాలెంజ్ ఎంత వేగంగా ప్రపంచమంతటా వ్యాపించిందో, అంత త్వరగా చల్లారింది. ఆ ఛాలెంజ్ చల్లారినా, అలాంటి ఛాలెంజ్లు మాత్రం పుట్టుకొస్తూనే వున్నాయి. ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం ప్రారంభించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అమెరికా యువతరం ఒక కొత్త ఛాలెంజ్ని ప్రారంభించారు. ఆ ఛాలెంజ్ పేరు ‘ఫైర్ ఛాలెంజ్’ ఒంటిమీద పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకుని, వెంటనే నీళ్ళలోకి దూకే ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్న చాలామంది తీవ్రంగా గాయపడుతున్నారు. అబ్బాయిలే కాదు... అమ్మాయిలు కూడా ఈ ఛాలెంజ్లో పాల్గొంటూ గాయపడుతున్నారు. ఈ మధ్య ఈ ఫైర్ఛాలెంజ్లో పాల్గొన్న ఇద్దరు అన్నదమ్ములు ఒంటికి నిప్పంటించుకున్నారు. అయితే మంటలు విపరీతంగా వ్యాపించాయి. పక్కన ఉన్నవాళ్ళు సమయానికి మంటలార్పి వాళ్ళని కాపాడారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే నిప్పంటించుకుని ఏడుస్తున్న ఓఅమ్మాయి ఫొటో కూడా సోషల్ మీడియాలో సంచరిస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన ఛాలెంజ్ల కారణంగా తమ పిల్లలు ఏమైపోతారో అని అమెరికాలోని తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.






