ఎవరెస్టుపై చిక్కుకుపోయిన తెలుగువారు

 

భూకంపం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి పర్వతారోహణకు వెళ్లిన 20 మంది ఐదు రోజులుగా ఎవరెస్ట్ పై చిక్కుకుపోయినట్లు సమాచారం. ఆ బృందానికి సారధ్యం వహిస్తున్న శేఖర్ బాబు ఒక మీడియాకు సంస్థకు ఫోన్ చేసి భారత్, చైనా ప్రభుత్వాలు తమకు సహకరించి తమను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ మీడియా వెబ్ సైట్లో వార్త ప్రచురితమవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తెలుసుకున్నతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వారిని సురక్షితంగా తీసుకువచ్చే ప్రయాత్నాలు చేపడుతున్నాయి. వారు ఎవరెస్టుపై సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో చైనా వైపు ఉన్నట్టు సమాచారం.