కేసీఆర్, కడియంను ఉరికిచ్చి తంతారు

posted on: Sep 28, 2015 6:37PM

ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియంపై తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు, కేసీఆర్, కడియంను ప్రజలు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు, తనను అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కుట్ర పన్నారన్న ఎర్రబెల్లి... అక్రమ కేసులతో జైల్లో ఉంచాలని చూశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి దౌర్జన్యం జరగలేదని, నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కి రోజులు దగ్గర పడ్డాయన్నారు. శృతి, సాగర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌కు కడియం శ్రీహరే బాధ్యత వహించాలన్న దయాకర్ రావు.... దమ్ముంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు

google-ad-img
    Related Sigment News
    • Loading...