ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోలేకపోయాయి.. ఎర్రబెల్లి

తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోలేకపోయాయని అన్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి బరిలో ఉండి ఉంటే పోటీ ఇంకా ఎక్కువ ఉండేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ను నిలదీయడానికే ప్రజలు ఓటేశారన్నారు. వరంగల్ ఉపఎన్నిక రెఫరెండం అయితే ఇతర పార్టీల్లోనుండి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారందరూ రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అన్నారు.