భారత్ లో రికార్డ్ సృష్టించిన ఇంగ్లాండ్

 

 England secure draw at Nagpur, England clinch series, India  England, England end 28 year wait in India

 

భారత్ లో ఇంగ్లాండ్ రికార్డ్ సృష్టించింది. 28 ఏళ్ల తర్వాత భారత గడ్డపై ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ చేజిక్కించుకుంది. నాగపూర్ లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్ట్ డ్రాగా ముగిసింది. 2-1తో ఇంగ్లాండ్ సిరీస్‌ను గెలుచుకుంది. నాగపూర్ టెస్ట్ కీలకమైన ఐదో రోజు ఇండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. రోజంతా ఆడి ఒక్క ఒక్క ట్రాట్ వికెట్ మాత్రమే తీశారు. ఇంగ్లాండు ఆటగాళ్లు పరుగుల కంటే వికెట్‌ను కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. బెల్ (103) సెంచరీ చేశాడు. నాగపూర్ పిచ్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర అసంతృప్తి వ్యక్థం చేశాడు. మరో మూడు నాలుగు రోడులు ఆడినా ఈ మ్యాచు డ్రా అయి ఉండేదని ఆయన నాలుగో టెస్టు మ్యాచ్ ఫలితంపై వ్యాఖ్యానించాడు.