523 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

 

England all out for 523,  England all out, Eden Gardens Test, England india

 

 

కోల్ కతాలో జరుగుతున్న మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 523 పరుగులకు ఆలౌటైంది. 509/6 పరుగులతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దెబ్బకి 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు భారత్ పై 207 పరుగుల ఆధిక్యం లభించింది. నాల్గో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే ప్రజ్ఞాన్ ఓజా గ్రేమ్ స్వాన్ ఔట్ చేసాడు. తర్వాతి ఓవర్లో జహీర్ ఖాన్ మరో ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ మాట్ ప్రియర్ ను పెవిలియన్ దారి పట్టించాడు. ఆ తర్వాత అశ్విన్ రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, మాంటీ పనేసర్ ను ఔట్ చేసాడు. ఇండియా బౌలర్లలో ఓజాకు నాలుగు వికెట్లు లభించగా, అశ్విన్ కి మూడు వికెట్లు, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.