Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీట్లు భర్తీకాక ఆందోళనలో ఇంజనీరింగు కళాశాలలు?
posted on: Oct 1, 2012 8:51AM
.png)
ప్రభుత్వపోకడ, జరిగిన ఆలస్యం వల్ల ఇంజనీరింగు కళాశాలల సీట్లు భర్తీ కాలేదు. దీంతో ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఎప్పుడు ఈ సీట్లు భర్తీ అవుతాయో తెలియటం లేదని, ఈ సీట్లు కనుక భర్తీ కాకపోతే తమ కళాశాలకు తీవ్ర నష్టం తప్పదని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాల్లోని ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలతో ‘తెలుగువన్.కామ్’ మాట్లాడితే అన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ 40శాతం సీట్లే భర్తీ అయ్యాయని తెలిసింది. పూర్తిగా సీట్లు భర్తీ చేసుకున్న కళాశాలలు వేళ్లతో లెక్కపెట్టవచ్చని, ఈ రెండు జిల్లాల్లో రెండు, మూడు కళాశాలలు మాత్రమే ఆ స్థితిలో ఉన్నాయని ఇంజనీరింగు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్పుల పేరుతో తమ కళాశాలల భవిష్యత్తుతో చెలగాటమాడిరదని ఒక ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎక్కువైన ఫీజురీయంబర్స్మెంట్ వల్ల ప్రభుత్వం కూడా భారీగా నష్టపోతోందన్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే తమను కూడా ప్రభుత్వమే పరోక్షంగా నష్టపరించిందన్నారు. అసలు రీయంబర్స్మెంట్ ఆశయం గొప్పదైనా ప్రభుత్వం సీట్ల భర్తీ గురించి ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వానికి సీట్ల భర్తీపై ఒక ప్రణాళిక ఉంటే ప్రైవేటు కళాశాలల విషయంలో ప్రవర్తించే తీరే మారేదని ప్రత్యేకించి మంత్రి పితాని సత్యాన్నారాయణ గురించి వ్యాఖ్యానించారు. పితాని ఫీజురీయంబర్స్మెంట్ విషయంలో ఒక నిబంధనావళిని ప్రకటించటం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసేలా ఉందని స్పష్టం చేశారు. లగ్జరీ జీవితాన్ని అనుభవించేవారికి రీయంబర్స్మెంట్ అందకుండా చర్యలు తీసుకోవటం సాధ్యమయ్యే పని కాదని ఆయన గుర్తించాలని సూచించారు.


.png)
.png)


