Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ రంగాన్నైనా మిగల్చండి!
posted on: Sep 21, 2012 6:29PM

నేడు ఏరంగంలోనైనా మనకు ఎంత వస్తోందనే తప్ప ఎంతవరకు తీసుకున్న దానికి న్యాయం చేశామన్న విషయమనే పట్టించుకోవడం లేదు. అందుకు ఉదాహరణలే డైట్ కాలేజీలు. గతంలో ప్రమాణాలు లేకపోయినా దొడ్డిదారిన ప్రమాణాలు పొంది ఎన్నో కాలేజీలు తమ కాలేజీలను నిర్వహించాయి. ఈ ఏడాది ప్రమాణాలు లేకుండా అలాగే కొనసాగటానికి కాలేజీల అనుమతులకు పట్టుబడుతున్నాయి యాజమాన్యాలు. సర్కారుపై ఒత్తిడులు పెరిగిపోతున్నాయి. ప్రమాణాల సంగతి ఎలా వున్నా బేరసారాలల్లో మాత్రం ఓ కొలిక్కి వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఉపాధ్యాయ విద్య బోధనకు కావల్సిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే డైట్ కాలేజీలను పటిష్టం పరచి నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేలా చూడాలి. లేదంటే... ఇప్పటికే విద్యావ్యవస్థ వ్యాపారమయమైపోతోంది. అన్నిరంగాల్లోను అవినీతి క్యాబరే ఆడుతోంది. కనీసం ఈ రంగాన్నయినా నిజాయితీగా వుండనిస్తే మేలు. లేదంటే భావితరం భ్రష్టుపట్టి పోతుందని, ఉపాధ్యాయ విద్య నాణ్యతను కోల్పోతే రాబోయే కాలమంతా బోధనతో, పరీక్షలతో పనిలేకుండా విద్యను కొనుక్కోవడమే అవుతుందేమోనని విద్యాభిమానులు ఆందోళన చెందుతున్నారు.





