Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ లిక్కర్ స్కాం..రంగంలోకి ఈడీ?
posted on: May 8, 2025 3:51PM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ దర్యాప్తునకు రంగం సిద్ధమైందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. ఈ కుంభకోణం నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు వివరాలు కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏపీ పోలీసులకు లేఖ రాసింది. ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ సహా కేసు వివరాలన్నీ సమర్పించాల్సిందిగా ఈ లేఖలో ఈడీ ఏపీ పోలీసులను కోరింది. ఈ మేరకు ఈడీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కు, విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖలు రాసింది.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన ఈ ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తునకు ఈడీ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఎఫ్ఐఆర్ తో పాటుగా ఈ కేసులో ఇంత వరకూ జరిగిన దర్యాప్తు వివరాలు, సీజ్ చేసిన అక్కంట్ల వివరాలు, అలాగే ఈ నగదు లావాదేవీల వివరాలు, ఇంత వరకూ జరిగిన అరెస్టులు తదితర సమాచారాన్ని అందించాలని ఈడీ సిట్ చీఫ్, బెజవాడ పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖలో కోరింది.
ఈ కేసు దర్యాప్తు ఈడీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వా చాలా కాలంగా కోరుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలు సందర్భాలలో ఈ కేసును ఈడీకి రిఫర్ చేస్తామని ెప్పారు. అవినీతి వ్యవహారంలో సిట్ చర్యలు తీసుకుంటుంది, కానీ మనీల్యాండరింగ్, అక్రమ నగదు లావాదేవీలు తదితర అంశాలు కూడా ఈ కేసులో బయటపడటంతో ఈడీ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది.






