Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ నాకు జీతం ఇవ్వడంలేదు.. చెప్పినట్టు చేయడానికి..
posted on: Nov 7, 2015 3:25PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల తొలగింపుపై ఇప్పటికే చాలా రకాల విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ మండిపడ్డారు. గతంలో ఓట్ల తొలగింపుపై కావాలనే ఓట్లు తొలగించారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల వల్లే అధికారులు ఓట్లు తొలగించారని విమర్శించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. కేసీఆర్ ఆదేశాలు పాటించేందుకు నేను ఆయన కింద పనిచేయడంలేదు.. ఆయన చెప్పినట్టు వినడానికి.. ఆయన నాకు జీతం ఇవ్వడంలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నేనేమి తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ను కాను.. అయినా ఆయనకు భయపడి ఓట్లను తొలగించాల్సిన అవసరం నాకేంటి అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ నేను చాలా చోట్లకు బదిలీ అయ్యాను.. అందుకు ముఖ్యమంత్రులు చెప్పినట్టు వినకపోవడమే కారణమంటూ చెప్పుకొచ్చారు.






