పార్టీ సింబల్ చూపించినందుకు మోడీపై కేసు

 

భారతీయ జనతాపార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మీద ఎన్నిక కమిషన్ ఒక కేసు నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన చేత్తో కమలం గుర్తును పట్టుకుని మీడియాకి చూపించారు. ఈ దృశ్యాలు దేశవ్యాప్తంగా టీవీ ఛానెళ్ళలో ప్రదర్శితమయ్యాయి. ఇలా బీజేపీ గుర్తును చూపించడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదు అందుకున్న ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పరిశీలించి నరేంద్ర మోడీ మీద కేసు నమోదు చేసింది.