Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తరాది వణికింది, కాశ్మీర్ కూలింది
posted on: Oct 26, 2015 3:39PM

అఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ పర్వతాలు కేంద్రంగా ఏర్పడిన భూకంపం ప్రభావం ఉత్తర భారత్ పై పడటంతో నార్తిండియన్స్ వణికిపోయారు, జమ్మూకాశ్మీర్ మొదలుకుని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ వరకూ భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు, జమ్మూకాశ్మీర్ పై భూకంప ప్రభావం అధికంగా ఉండటంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించినట్లు తెలుస్తోంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని, ఎక్కడికక్కడ కరెంట్ పోల్స్ కూలిపోయాయని తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్ లో ప్రాణ ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.






