Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తర భారత్ లో భారీ భూకంపం
posted on: Oct 26, 2015 3:22PM

పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది, దాని ప్రభావం భారత్ పైనా పడింది, నార్తిండియాలోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి, అఫ్ఘన్ లోని హిందూకుష్ పర్వత శ్రేణులు కేంద్రంగా ఏర్పడిన ఈ భూకంపం తీవ్రత పాకిస్తాన్ లో 7.7గా నమోదు కాగా, ఉత్తర భారత్ లో అది 7.5గా ఉందని చెబుతున్నారు, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఐదారు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు, ఢిల్లీలో మెట్రోరైల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు, భూకంపం ప్రభావం జమ్మూకాశ్మీర్ లో అధికంగా ఉందని తెలుస్తోంది, భూప్రకంపనల ధాటికి కాశ్మీర్ లో పలు భవనాలు ధ్వంసమయ్యాయని వార్తలు అందుతున్నాయి.






