Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రక్షణ చరిత్రలో ఆపరేషన్ సిందూర్ ఒక మైలురాయి : రాష్ట్రపతి
posted on: Aug 14, 2025 9:04PM

భారత్ తన పౌరుల రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడబోదని ఆమె తేల్చిచెప్పారు. "మేము ఎప్పుడూ దురాక్రమణకు పాల్పడము, కానీ మా పౌరులను కాపాడుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించము అనే విషయాన్ని ప్రపంచం గుర్తించింది" అని ముర్ము పేర్కొన్నారు. ఈ విషయాన్ని వివిధ దేశాలకు వివరించడంలో పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు కీలక పాత్ర పోషించాయని, ఇది దేశ ఐక్యతకు నిదర్శనమని ప్రశంసించారు.
రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సాధించిన పురోగతికి ఆపరేషన్ సిందూర్ ఒక పరీక్షలా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జాతినుద్దేశించి ఆమె ప్రసంగిస్తూ, ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని స్పష్టం చేశారు. కశ్మీర్లోని పహల్గామ్ లో అమాయక యాత్రికులపై జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా రాష్ట్రపతి ఖండించారు. దేశ రక్షణ చరిత్రలో 'ఆపరేషన్ సిందూర్' ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ముర్ము పేర్కొన్నారు.
ఈ సంవత్సరం దేశం ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. "పహల్గామ్లో అమాయకులైన పర్యాటకులపై జరిగిన దాడి పిరికిపందల చర్య, అత్యంత అమానుషం" అని ఆమె అన్నారు. అయితే, ఈ దాడికి భారత్ అత్యంత వేగంగా, నిర్ణయాత్మకంగా బదులిచ్చిందని తెలిపారు. "మన సాయుధ బలగాలు స్పష్టమైన వ్యూహంతో, సాంకేతిక సామర్థ్యంతో సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాదంపై మానవాళి చేస్తున్న పోరాటంలో ఆపరేషన్ సిందూర్ చరిత్రలో నిలిచిపోతుంది" అని రాష్ట్రపతి వివరించారు.
భారత్ తన పౌరుల రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడబోదని ఆమె తేల్చిచెప్పారు. "మేము ఎప్పుడూ దురాక్రమణకు పాల్పడము, కానీ మా పౌరులను కాపాడుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించము అనే విషయాన్ని ప్రపంచం గుర్తించింది" అని ముర్ము పేర్కొన్నారు. ఈ విషయాన్ని వివిధ దేశాలకు వివరించడంలో పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు కీలక పాత్ర పోషించాయని, ఇది దేశ ఐక్యతకు నిదర్శనమని ప్రశంసించారు.మన దేశీయ తయారీ రంగం కీలక స్థాయికి చేరుకుంది. భద్రతా అవసరాల్లో చాలా వరకు మనం స్వయం సమృద్ధి సాధించాం" అని ఆమె తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ, డిజిటల్ చెల్లింపులు, పట్టణ మౌలిక వసతులు, వ్యవసాయ సంస్కరణల్లో దేశం సాధించిన ప్రగతిని అభినందించారు. అమృత్ వంటి పథకాలు, 4జీ కనెక్టివిటీ విస్తరణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, భూమి, నదులు, పర్వతాలు, జీవరాశులతో మన సంబంధాన్ని పునర్నిర్వచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రసంగం చివరలో సైనికులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవ్యవస్థ సభ్యులు, దౌత్యవేత్తలు, ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి ముర్ము స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.



.webp)


