TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మరోసారి వాయిదా 

Published on: Wed Nov 6, 2024 6:19PM

ఎమ్మెల్యేల అనర్హతపై  పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి.  పార్టీ ఫిరాయించిన పార్టీ  ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదాపడింది.  ఈ కేసు విచారణ రేపటికి వాయిదా వేస్తూ డివిజన్ బెంచ్    నిర్ణయం తీసుకుంది.  సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ను అసెంబ్లీ కార్యదర్శి ఆశ్రయించారు. రేపు కూడా వాదనలు జరుగనున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున  లాయర్ కోర్టులో పిటిషన్ దాఖ లు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్ కు  ఉంటుందని లాయర్ కోర్టులో వాదించారు. ఎమ్మెల్యేల తరపున లాయర్ వేసిన పిటిషన్ కొట్టివేయాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోరారు