Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రామోజీ, రాధాకృష్ణతో దిగ్విజయ్ మీటింగ్?
posted on: Oct 21, 2015 2:26PM

ఈమధ్య పొలిటికల్ లీడర్స్ అంతా మీడియా అధినేతల చుట్టూ తిరుగుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావును వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం సంచలనం సృష్టించగా, తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ .... రామోజీతో సమావేశం కావడంతో ఆసక్తిరేపుతోంది, అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కూడా కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. మర్యాదపూర్వకంగానే సమావేశమైనట్లు చెబుతున్నా, మీడియా అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికే కలిసినట్లు టాక్ వినిపిస్తోంది, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే మీడియా అండ ఉండాలని గుర్తించిన డిగ్గీరాజా... ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.






