తెలంగాణపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు
posted on Jul 11, 2013 7:21PM
తెలంగాణ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాపై రాజ్యంగా సవరణ చేయవలిసి వుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించవలసి ఉంటుందని, అలాగే విపక్షాలతో కూడా మాట్లాడవలసి ఉంటుందని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని, ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణాపై ఇప్పుడేమి చెప్పలేమని, సందిగ్దత మాత్రం తొలగిస్తామని చెప్పారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. పూర్తి సమాచారం తెలుసుకొని దీనిపై స్పందిస్తామని అంటున్నారు.