డిగ్గీ అఫైర్..అమృతే ఇరికించిందా?

 

 

 

దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్ మధ్య చాలాకాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారం నాటకీయ పరిణామాల మధ్య బయటపడటం, దొరికిపోయిన దిగ్విజయ్ సింగ్ తాను అమృతని పెళ్ళి చేసుకోబోతున్నానని ప్రకటించడం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆశ్చర్యంతోపాటు ఎన్నో అనుమానాలను కూడా కలిగిస్తోంది.

 

అమృతతో దిగ్విజయ్ సింగ్ చాలా సన్నిహితంగా వున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో దిగ్విజయ్‌కి తమ మధ్య వున్న సంబంధం గురించి దిగ్విజయ్ ట్విట్టర్‌లో బహిర్గతం చేసేశాడు. ఆ తర్వాత అమృత కూడా ట్విట్టర్‌లో తాము పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించింది. అదేవిధంగా తన కంప్యూటర్ని, ఈ మెయిల్‌నీ ఎవరో హ్యాక్ చేశారని అమృత వాపోయింది. దీనిద్వారా అమృత చెప్పదలుచుకున్నది ఏమంటంటే, దిగ్విజయ్, తాను సన్నిహితంగా వున్న ఫొటోలు నా కంప్యూటర్లో, ఈ మెయిల్లో వున్నాయి. వాటిని ఎవరో సంపాదించి ఇంటర్నెట్‌లో లీక్ చేశారు.



అయితే ఇక్కడ అందరికీ ఒక అనుమానం వస్తోంది. చాలాకాలంగా దిగ్విజయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిన అమృతే ఇక దిగ్విజయ్‌ని పెళ్ళి చేసుకుంటే బెటరేమో అన్న ఉద్దేశంతో ఆమే ఫొటోలు లీక్ చేసి వుండొచ్చేమో! ఇలాంటి ప్లాన్‌కి ఉపయోగించడం కోసమే దిగ్విజయ్‌, తాను ఏకాంతంగా వున్నప్పుడు కంప్యూటర్ కెమెరా ద్వారా ఆ దృశ్యాలను ఫొటోలు తీసిందేమో. సదరు ఫొటోలను తానే లీక్ చేయడం ద్వారా దిగ్విజయ్ సింగ్‌ని పెళ్ళి ఉచ్చులో ఇరికించేసిందేమో.. ఏమో!