TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది... ధూళిపాళ్ల

Published on: Tue Mar 10, 2015 2:49PM

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వ విప్ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. జగన్ అవినీతిపై చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలు నిజమైతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి చేతులు ముడుచుకున్నాడా? అని ప్రశ్నించారు. జగన్ తాత రాజారెడ్డి చరిత్ర ఎంటో తెలుసనీ, వెంకటసుబ్బయ్య అనే గని యజమానిని చంపిన చరిత్ర వారిదని విమర్శించారు. చంద్రబాబుపై రాజశేఖర్ రెడ్డి ఎన్నో అక్రమ కేసులు వేశారని అన్నారు.