ధోనీకి జరిమానా...
posted on: Apr 8, 2015 4:58PM
.jpg)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్స్ అంటే ఎంతిష్టమో మనందరికీ తెలుసు. క్రికెట్ షెడ్యూల్తో ఎప్పుడూ జిజీగా ఉండే ధోని ఏ మాత్రం సమయం దొరికినా బైక్ మీద వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు. అయితే బుధవారం ధోని తన కొత్త బైకు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బైకు మీద రైడ్ చేయడానికి చాలా ఆతృతగా ఉందని, దానికి మరో నెలన్నర రోజులు టైమ్ పడుతుందని అన్నారు. ఇదిలా ఉండగా ఆయన మంగళవారం తన హోం టౌన్ రాంచీ వీధుల్లో బుల్లెట్ పైన తిరిగగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని ట్రాఫిక్ పోలీసులు రూ.450 జరిమానా విధించారు.






