టీఆర్ఎస్ లో చేరమనేది ఎర్రబెల్లే

posted on: May 11, 2015 5:34PM

 

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈయన తెలంగాణ టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకర్ పై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేరమని చెప్పింది ఎర్రబెల్లి దయాకరే అని, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ పరకాల నుంచి పోటీచేసేందుకు సిద్దమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ఎన్నికల్లో నిలబడతానని, ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ప్యాకేజీలు తీసువడం ఎర్రబెల్లికి అలవాటేమో కాని ఆ సంస్కృతి తనకు లేదని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...