తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

posted on: Apr 10, 2024 9:11AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 10)ఉదయం కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను డైరెక్ట్ క్యూలైన్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (ఏప్రిల్ 9) శ్రీవారిని మొత్తం 55 వేల 756 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 17 వేల 866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 71లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...