Latest News
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
posted on: Aug 18, 2025 10:00AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం (ఆగస్టు 18)ఉదయం తిరుమలేశుని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శ్రీకృష్ణ తేజ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఆగస్టు 17) శ్రీవారిని మొత్తం 86 వేల364 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 712 మంది తలరీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 46 లక్షల రూపాయలు వచ్చింది.



.webp)


