TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published on: Tue Aug 12, 2025 10:11AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం (ఆగస్టు 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉణ్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక సోమవారం  (ఆగస్టు 11) శ్రీవారిని మొత్తం  75 వేల 740 మంది దర్శించుకున్నారు. వారిలో  34 వేల 958 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 84 లక్షల రూపాయలు వచ్చింది.