తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
posted on: Aug 11, 2025 10:00AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గత వారం అంతా భక్త జనసందోహంతో కిటకిట లాడిన తిరుమలలో సోమవారం ( ఆగస్టు 11) భక్తుల రద్దీ ఒకింత తగ్గింది. తిరుమల వేంకన్న దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో మూడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఆగస్టు 10) శ్రీవారిని మొత్తం 82 వేల 629 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 505 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది.


.webp)



