తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
posted on: Aug 5, 2025 9:15AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం తిరమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మంగళవారం (ఆగస్టు 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఆగస్టు 4) శ్రీవారిని మొత్తం 69 వేల 928 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 21 లక్షల రూపాయలు వచ్చింది.



.webp)


