తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Tue Jun 17, 2025 9:22AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (జూన్ 17) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎటీజీహెచ్ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (జూన్ 16) శ్రీవారిని మొత్తం 84 వేల 681 మంది దర్శించుకున్నారు. వారిలో 35 వేల251 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 43 లక్షల రూపాయలు వచ్చింది.


