TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Mar 25, 2025 9:39AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (మార్చి 25) ఉదయం శ్రీవారి  దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏజీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 68 వేల 358 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 24 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 54 లక్షల రూపాయలు వచ్చింది.