తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు

posted on: Mar 20, 2025 8:42AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మార్చి 19) శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు 3 కోట్ల 97 లక్షల రూపాయలు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72 వేల 388. వీరిలో 26వేల 145 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇక గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...