తిరుమలలో పెరిగిన రద్దీ
Published on: Wed Mar 19, 2025 9:20AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం (మార్చి 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం(మార్చి 18 ) శ్రీవారిని మొత్తం 56 వేల 487 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 909 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 75 లక్షల రూపాయలు వచ్చింది.


