తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sun Mar 16, 2025 10:10AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (మార్చి 16) ఉదయం శ్రీవారి దర్శనం కోం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక శనివారం శ్రీవారిని మొత్తం 82 వేల 580 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 5 కోట్ల రూపాయలు వచ్చింది.


