Latest News

తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి భక్తుల రద్దీ

posted on: Feb 10, 2025 8:41AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (ఫిబ్రవరి 9) శ్రీవారికి మొత్తం 84 వేల 536 మంది దర్శించుకున్నారు. వారిలో పాతికవేల 890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 76 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక సోమవారం (ఫిబ్రవరి 10) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  27 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టెకెన్లు లేని భక్తులకు 15 గంటలకు పైగా సమయం పడుతోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...