తిరుమల శ్రీవారి సర్వదర్శనాకి 8 గంటలు
Published on: Tue Jan 28, 2025 8:24AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (జనవరి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక సోమవారం (జనవరి 27) శ్రీవారిని మొత్తం 65 వేల 278 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 77 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 7 లక్షల రూపాయలు వచ్చింది.


