తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

posted on: Dec 28, 2024 8:20AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడం, కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో భక్తులు తిరమలకు పోటెత్తుతున్నారు. శనివారం (డిసెంబర్ 28)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 66 వేల 715 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 503 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 6 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...