తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

posted on: Dec 5, 2024 6:38AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (డిసెంబర్ 5) శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక బుధవారం శ్రీవారిని 65 వేల 625 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇఖ శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 27లక్షల రూపాయలు వచ్చింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...