తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Tue Dec 3, 2024 9:23AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (డిసెంబర్ 3) శ్రీవారి దర్శనం కోసం మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 58 వేల 607 మంది దర్శించుకున్నారు. వారిలో 19 వేల 841 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 61 లక్షల రూపాయలు వచ్చింది.


