Latest News
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
posted on: Nov 9, 2024 8:42AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం (నవబంర్ 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 64 వేల 983 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 324 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.


.webp)



