శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
posted on: Nov 5, 2024 8:24AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (నవంబర్ 5)ఉదయం శ్రీవారి దర్శనం కోసం 13 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 74 వేల 651 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 712 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హఉండీ కానుకల ఆదాయం 4 కోట్ల 14 లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS






