తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Oct 30, 2024 8:43AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (అక్టోబర్ 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 59 వేల 140 మంది దర్శించుకున్నారు. వారిలో 16 వేల 937 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది.






