తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

posted on: Oct 6, 2024 8:14AM

తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తోడు దసరా సెలవులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఉండటంతో తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం (అక్టోబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని 76 వేల 552 మంది దర్శించుకున్నారు. వారిలో 35వేల 885 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండా ఆదాయం 2 కోట్ల 54లక్షల రూపాయలు వచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...