శ్రీవారి సర్వదర్శనానికి ఆరుగంటలు

posted on: Aug 5, 2024 9:46AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (ఆగస్టు 5) ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల కంటే తక్కువ సమయం పడుతోంది. ఆదివారం (ఆగస్టు 4) శ్రీవారిని మొత్తం 75వేల 356 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 815 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 90 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...